AP Ration Vehicles: నేడు రేషన్ వాహనాలు?? ఏపీలో కొత్త కూటమి ప్రభుత్వ నిర్ణయాలు

AP Ration Vehicles: ఏపీలో ఇటీవల ఏర్పడిన కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇప్పటి వరకు పలు పథకాలకు పేర్లు మార్చిన ఈ ప్రభుత్వం, పెన్షన్ పంపిణీలో వాలంటీర్లను పక్కన పెట్టే సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమానికి తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టింది. రేషన్ పంపిణీ వాహనాలను నిలిపివేస్తూ పాత రేషన్ షాపుల విధానాన్ని మళ్లీ ప్రారంభించనుంది. ఈ విషయాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు.

AP Ration Vehicles

గిరిజన ప్రాంతాల్లో రేషన్ పంపిణీ మార్పులు

గిరిజన ప్రాంతాల్లో ఉన్న 962 రేషన్ పంపిణీ వాహనాలను నిలిపివేసే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మంత్రి సంధ్యారాణి. పాత రేషన్ షాపుల పద్ధతిని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించామని, ఎండీయూ యూనిట్ల ద్వారా రేషన్ పంపిణీని నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తాజా నిర్ణయంతో గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్ పంపిణీ నిలిపివేయబడింది.

Telegram Group Join

Also Read: AP Volunteers: వాలంటీర్లకు షాక్!! పేపర్ భత్యం నిలిపివేత!!

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాంగ్ మా Telegram మరియు Whatsapp ఛానల్ లో చేరండి. 👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment